Keerthy Suresh | కీర్తి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Written by admin

Published on:

Keerthy Suresh | మలయాళీ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకా దంపతుల ముద్దుల కుమార్తె కీర్తి. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తి.. బాలనటిగా వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం కథానాయికగా విమర్శకుల ప్రశంసలు అందుకుని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. 2013లో మలయాళంలో గీతాంజలి మూవీ ద్వారా హీరోయిన్‏గా కీర్తి, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక అనేక చిత్రాల్లో నటించింది.

ఆమె 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది.తాజాగా కీర్తి సురేష్ తమిళంలోనే కాకుండా మలయాళం, తెలుగు వంటి పాన్-ఇండియన్ భాషలలో నటించింది. సుమన్ కుమార్ దర్శకత్వంలో రఘుదత్తా చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది.కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా చిత్రంలో నటిస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం హిందీలో హీరో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్టులో నటిస్తోంది.

Keerthy Suresh

మొదటి సినిమా..

మొదటి సినిమా నేను శైలజా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకేనట అంతకుముందు అమ్మడు ఐన ఇష్టం నువ్వు అనే సినిమాలో నటించింది. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది గాని సినిమా బిజినెస్ లేక విడుదల చేయలేకపోయారు. 2015 లో సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు అతిధులుగా వచ్చి సినిమాను ప్రమోట్ చేసే విధంగా ప్రయత్నం చేశారు.

సీనియర్ నిర్మాత రామానాయుడు మరో సీనియర్ దర్శకుడు కే.రాఘవేంద్ర రావ్ కూడా సినిమాకు సంబందించిన కార్యక్రమలలో పాల్గొనగా ఆ సినిమా కనీసం కొన్ని థియేటర్స్ లలో కూడా రిలీజ్ కాకపోయింది. దీంతో నవీన్ విజయ్ నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక కీర్తి సురేష్ ఆ సినిమా ఆగిపోయింది అని తెల్సుకొని చాలా అప్సెట్ అయ్యిందట. ఇక నెక్స్ట్ అలా కాకూడదని రామ్ – నేను శైలజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి హిట్ అందుకుంది.

మహానటి కి నో చెప్పాను

మహానటి సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఆమె నటకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది. మహానటి సావిత్రిని మైమరపించి.. నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ మూవీ కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.

Also Read : ఉదయ భాను కొత్త ఇల్లు చూస్తే ఇంద్రభవనమే..

అయితే ఆ సినిమాని ఒప్పుకున్న సమయంలో అసలు ఆమె పాత్రకి ఎలా సరిపోతావు అంటూ చాలామంది కామెంట్లు చేశారట. “అందుకే మొదట ఆ సినిమాకి నేను నో చెప్పాను. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పట్టు పట్టి నా పై నమ్మకాన్ని చూపించి ధైర్యం చెప్పి నాతో సినిమా చేయించారు. ఆయన నన్ను అంతగా నమ్ముతున్నారు నేను ఎందుకు నన్ను నేను నమ్మకూడదు అని అనిపించింది. అందుకే మహానటి సినిమాలో నటించిన. సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా నాపై వచ్చిన ట్రోల్స్ చూసి చాలా షాక్ అయ్యాను. కానీ సినిమా విడుదల తర్వాత వాటన్నిటికీ జవాబు లభించినట్లు అయింది.

Keerthy Suresh

కీర్తి సురేష్ తల్లి కూడా హీరోయిన్ ..

ఇదిలా ఉండగా…కీర్తి సురేష్ తల్లి పేరు మేనక అని.. ఆమె గతంలో హీరోయిన్ గా నటించిందని.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా నటించిందని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. అందులోనూ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటించింది అనే విషయం అస్సలు తెలిసుండదు. అవును కీర్తి తల్లి మేనక..మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.విషయంలోకి వెళ్తే.. 1980లో ప్రఖ్యాత ‘ఏ.వి.యం’ సంస్థ నిర్మించిన ‘పున్నమి నాగు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎం.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో పూర్ణిమ అనే పాత్రలో ఈమె కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

డిసెంబర్ లో గోవాలో పెళ్లి

కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఇదంతా ఫేక్ వార్తే అని అనుకున్నారు జనాలు . ఫైనల్లీ కీర్తి సురేష్ తండ్రి దగ్గర నుంచి అఫీషియల్ ప్రకటన రావడంతో ఇదంతా నిజమే అంటూ జనాలు కూడా నమ్మడం ప్రారంభించారు. అంతేకాదు తాజాగా కీర్తి సురేష్ 15 ఏళ్ల బంధం ఇంకా ఎన్నెన్నో సంవత్సరాల కొనసాగిపోతుంది అంటూ తనకు కాబోయే భర్త ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకి పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది.డిసెంబర్ లో గోవాలో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు కేవలం కొందరు ముఖ్యమైన సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి కీర్తి సురేష్ కూడా అధికారికంగా ప్రకటించి, తాను జీవితంలో కొత్త అధ్యాయానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.వివాహం గోవాలో ఓ ప్రముఖ రిసార్ట్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కీర్తి కుటుంబం ఈ వేడుకను ప్రైవేట్ ఈవెంట్‌గా మార్చాలని నిర్ణయించుకుంది. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి,నేచురల్ స్టార్ నాని ఈ పెళ్లికి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంథోని తట్టిల్ కేరళకు చెందిన ఈయన, కీర్తి సురేష్ చదువుకునే రోజుల్లో నుంచే ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంథోని ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఆ తర్వాత ఖతర్ లో కూడా కొన్ని రోజులు పని చేశాడు.ఆర్థికంగా బలంగా ఉండటంతో కేరళకు తిరిగి వచ్చి సొంతంగా ఓ కంపెనీ ఓపెన్ చేశాడు. దాంతో పాటు అతనికి ఆస్పిరోస్ అనే మరో కంపెనీ కూడా ఉంది. వీటికి తోడు హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. ఇలా అతని ఆస్తి మొత్తం రూ.300 కోట్ల దాకా ఉన్నట్టు సమాచారం.

Also Read : ఎన్టీఆర్ తో పిల్లల కోసం నేను చేసింది ఇదే …

కీర్తి సురేష్ ఆస్తులు

కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటివరకు కీర్తి సురేష్ ఆస్తులు రూ.41 కోట్లు. ఆమె సంవత్సరానికి రూ.35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలే కాకుండా ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా కీర్తి సంపాదిస్తుంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్, ఎండార్స్‌మెంట్‌కి రూ.30 లక్షల వరకు వసూలు చేసిందని టాక్.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్ చేసిన పోస్ట్ కోసం రూ.25 లక్షల వరకు తీసుకుంటుంది.ప్రస్తుతం కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో నివసిస్తుంది. అలాగే ఆమెకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‏లో ఆమెకు ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. కీర్తి వద్ద రూ.60 లక్షల విలువైన Volvo S90, రూ.1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730Ld, రూ.81 లక్షల విలువైన Mercedes Benz AMG GLC43, టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. రూ. 25 లక్షలు ఉన్నాయి.

Keerthy Suresh

అటువంటి సినిమాలే చేస్తాను ..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ని ‘మీ తల్లి కంటే మీరేఎక్కువ పేరు సంపాదించుకున్నట్లు ఉన్నారు?’ అని ప్రశ్నించగా.. దానికి ఆమె అమ్మ స్థాయిని అందుకోవడం చాలా కష్టమని, ఆమె 120 సినిమాల వరకు చేసిందని కాకపోతే మాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయడంతో ఇక్కడి వారికి ఆమె గొప్పతనం తెలియదని చెప్పింది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన తల్లి సక్సెస్ అయిందని, పెళ్లి తరువాత వ్యక్తిగత జీవితం కోసం నటనకు దూరమైందని.. అయినా సంతోషంగా ఉన్నానని చెప్పేవారని తెలిపింది.నటిగా, వ్యక్తిగా మా అమ్మే నా రోల్ మోడల్ అని అంటోంది కీర్తి సురేష్. కుటుంబ గౌరవానికి భంగం కలిగించని సినిమాలే చేయాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

వారితో ప్రేమ

కీర్తి సురేశ్ చేసే పాత్రలు చాలా సహజంగా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఉండటంతో రియల్ లైఫ్‌లోనూ కీర్తి చాలా డీసెంట్ అనుకుంటారు. కానీ, అమ్మడు చాలా ట్రెండీగా ఉంటూనే అల్ట్రా మోడ్రన్ కల్చర్ ని ఫాలో అవుతుంది. గ్లామర్ గానూ ఇటీవల కాస్త హద్దులు దాటుతోంది. ఎప్పుడెప్పుడు కీర్తి లి ప్ కి s ఇస్తుందా..ఎప్పుడు నడుము చూపిస్తుందా అని ఎంతో ఆతృతగా అభిమానులు, జనాలు ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి కనిపించిన గ్లామర్ దీనికి కారణం.రానున్న సినిమాలలో ఖచ్చితంగా కీర్తి నుంచి రొ మా న్స్ ఆశించవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక అమ్మడికి ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు బిజినెస్ ఇండస్ట్రీస్ లో స్నేహితులు ఎక్కువే. ఇక్కడ నానిని వాడు వీడు అనేంత చనువు ఉంది. తమిళంలో అయితే తను నటించిన హీరోలే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ తోనూ చాలా క్లోజ్ గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని స్నేహితులతోనూ చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో కీర్తికి అన్నిసార్లు పెళ్ళి జరిగింది. బయటకి తెలియనంత మందితో ఎఫైర్స్ ఉన్నాయి..అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇంటికి వెళ్లి మరి పెళ్లి

అయితే కీర్తి సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమె ఒక రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకుంటూ వచ్చింది. తన ఇంటి బెల్ ఒకరోజు రింగ్ అయిందని, తీరా వెళ్లి చూస్తే గుమ్మంలో ఒక అభిమాని వచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడని చెప్పింది. అతనికి నేనంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతోనే అంత ధైర్యం చేసి వచ్చి.. నన్ను డైరెక్ట్గా నా ముఖం మీద పెళ్లి గురించి అడిగాడని చెప్పింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అలాగే రఘు తాత సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

🔴Related Post

Leave a Comment